టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే గోరంట్ల

83చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం బాలాజీపేటలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పరదాల చాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Job Suitcase

Jobs near you