ఎస్సీ కాలనీలో బడి బాట కార్యక్రమం

53చూసినవారు
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలను చేర్పించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు చాగల్లు మండలం, చాగల్లు 63, 69, 70 అంగన్వాడీ కేంద్రాలు ఎస్సీ కాలనీలో శనివారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను కేంద్రాలకు పంపాలని, కేంద్రాలలో విద్య పూర్తి చేసిన వారిని 1వ తరగతిలో చేర్చుతామని తల్లిదండ్రులకు తెలిపారు. విద్య ఆవశ్యకతను తెలియజేస్తు కరపత్రాలు పంచారు.

సంబంధిత పోస్ట్