కష్టం తప్ప కల్మషం తెలియని 45 సంవత్సరాలు వయస్సు పై బడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ ఆర్ధిక భరోసాను అందించి అండగా నిలిచారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఏర్పాటు చేసిన వైయస్సార్ చేయూత కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారన్నారు.