కడియం మండలంలోని జేగురుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు ఉప కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.