ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్: ఎంపీ భరత్

2259చూసినవారు
టీడీపీ- బీజేపీ- జనసేన ‘ప్రజాగళం’ సభ అట్టర్ ప్లాప్ అయిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజాగళం’ సభకు దేవుడు ఆశీర్వాదం లేదని, ప్రధాని మోదీ మాట్లాడుతుంటే మైకులు మొరాయించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలేనని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్