విఘ్నేశ్వరుని ఆలయంలో భక్తుల సందడి
అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 1, 33, 000 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.