వాడపల్లి వెంకన్నకు రూ. 33, 41, 181 ఆదాయం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వివిధ సేవల ద్వారా శనివారం రూ. 33, 41, 181 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి. కిషోర్ కుమార్ తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 23, 42, 722, అన్న ప్రసాదం ద్వారా రూ. 2, 16, 436, సేవల ద్వారా రూ. 38, 350, లడ్డు విక్రయం ద్వారా రూ. 5, 97, 285, విరాళాలు ద్వారా రూ. 1, 756, ఆన్లైన్ ద్వారా రూ. 1, 44, 632 ఆదాయం సమకూరినట్లు చెప్పారు.