May 02, 2024, 03:05 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలి
May 02, 2024, 03:05 IST
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పుట్టపల్లి లో బుధవారం సాయంత్రం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని, డీకే అరుణ ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ. మోడీ అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాల ద్వారా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంగాల రవిందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.