May 08, 2024, 16:05 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
ఉపాధి కూలీగా మారిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
May 08, 2024, 16:05 IST
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినూత్నంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హన్వాడ మండలం మునిమోక్షం గ్రామంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉపాధి బుధవారం హామీ పనులలో పాల్గొన్నారు. గడ్డపార పట్టి మట్టి తీశారు. ట్రాక్టర్ నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. కూలీలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.