Mar 28, 2024, 17:03 IST/గద్వాల్
గద్వాల్
భారీ చోరీ.. 40 తులాల బంగారం, రూ. 10లక్షలు అపహరణ
Mar 28, 2024, 17:03 IST
ఇంట్లో నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు పోయిన సంఘటన గురువారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగబాయి కాలనీలో చోటు చేసుకుంది. యజమాని ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు సుమారు రూ. 10లక్షలు అపహరణకు గురైందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.