Feb 26, 2025, 10:02 IST/
కేసులో రాజీ కాలేదని కన్నతల్లిని చంపిన కొడుకు
Feb 26, 2025, 10:02 IST
తెలంగాణలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో రాజీ కాలేదని కన్నతల్లిని చంపాడు ఓ కొడుకు. కామారెడ్డి జిల్లా పిట్లంనికి చెందిన సబీరా బేగం (60)కు నలుగురు కొడుకులు. 2021లో ఆమె రెండవ కొడుకు షాదుల్ మూడవ కొడుకు ముజీబ్ను కత్తితో పోడిచి చంపేశాడు. ఈ మర్డర్ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తుంది. నిందితుడు షాదుల్ తల్లి సబేరాను కేసుకు రాజీ కమ్మని కోరగా తల్లి అంగీకరించలేదు. దీంతో రోకలి దుండుతో కొట్టి చంపేశాడు.