వైఎస్ఆర్సిపి విజయం ఖాయం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘనవిజయం సాధించడం ఖాయమని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్ అన్నవరంలో ఆదివారం ఇటీవల టిడిపిని వీడి వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ. ఎన్నికల్లో రాజా గెలిచే వరకు ప్రతి గ్రామంలోని ప్రచారం నిర్వహిస్తానన్నారు. అనంతరం కృష్ణుడు వర్గం టిడిపిని వీడి మంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.