ఓటు వేసి ఆశీర్వదించండి: యనమల దివ్య
ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించాలని తుని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. తుని పట్టణంలోని ఎస్ ఎ రోడ్ మెయిన్ రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు, కొయ్య శ్రీను, మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.