చంద్రబాబుకు ఏపీ ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు ఇచ్చింది. CM జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని ఈసీకు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని.. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని ఈసీ ఆదేశాలిచ్చింది.