ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి జట్టును గాయాల సమస్య వేధిస్తోంది. ఇదివరకే పేసర్లు దిల్షాన్ మధుశంక, గెరాల్డ్ కోయేట్జీ ఆరంభ మ్యాచ్లకు దూరం అయ్యారు. తాజాగా ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరినట్లు సమాచారం. సూర్య తొలి మ్యాచ్లో ఆడడం అనుమానమే అని ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా, ముంబయి తన తొలి మ్యాచ్ను గుజరాత్తో మార్చి 24న ఆడనుంది.