బోట్ల తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి

71చూసినవారు
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోట్ల వెలికితీతకు అధికారులు, బేకం సంస్థ సర్వ ప్రయత్నాలు చేస్తున్నా, ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండటంతో వెలికి తీయడంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి రామానాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్