టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ (వీడియో)

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది. ఈ నెల 26న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఉదయభాను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్