పాఠశాలపై రాకెట్లతో దాడి చేసిన ఇజ్రాయెల్.. 22 మంది మృతి

66చూసినవారు
పాఠశాలపై రాకెట్లతో దాడి చేసిన ఇజ్రాయెల్.. 22 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. శనివారం గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ల దాడిలో 22 మంది మృతి చెందారు. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 22 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్