గత నాలుగు రోజులుగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో మంత్రి పార్థసారధి నూజీవీడు ట్రిపుల్ ఐటీని పరిశీలించారు. క్యాంపస్లోని క్యాంటీన్ను మంత్రి తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల అనారోగ్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని పార్థసారధి హెచ్చరించారు.