ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని తాత, మనవరాలు మృతి

65చూసినవారు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని తాత, మనవరాలు మృతి
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని తాత మనవరాలు మృతి చెందారు. జగిత్యాల జిల్లాలోని పొలాస వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లచ్చన్న(55) అనే వ్యక్తి తన మనవరాలు శ్రీనిధి(9), మనవడు మల్లికార్జున్ ను స్కూటీపై తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సును దాటే క్రమంలో వీరి స్కూటీని, మరో బైక్ ను ఢీకొంది. దీంతో లచ్చన్న, శ్రీనిధి అక్కడికక్కడే చనిపోగా, మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇదరికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్