గంజాయి బ్యాచ్ హల్‌చల్.. బ్లేడ్లు, బీర్ సీసాలతో దాడి (వీడియో)

62చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. గంజాయి సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. బ్లేడ్లు, బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రూ.50 వేల నగదు విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతోనూ గంజాయి బ్యాచ్ వాదనకు దిగారు. ఈ మేరకు నిందితులను పోలీస్ స్టేషన్ తరలించారు.

సంబంధిత పోస్ట్