AP: రాష్ట్రంలో త్వరలోనే బంగారం ఉత్పత్తి జరగనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనిలో 2024 ఏడాది చివరికల్లా పసిడి ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జొన్నగిరి గని కోసం జెమైర్సోర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే 250 ఎకరాల భూసేకరణ చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు సమాచారం. ఈ గని ప్రారంభమైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తవుతుందని అంచనా. భారత్లో ఇదే తొలి ప్రైవేటు బంగారు గని.