భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు, అర్చకుడిపై వేటు

69చూసినవారు
భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు, అర్చకుడిపై వేటు
భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడైన తిరుమల వెంకట సీతారాంలను సస్పెండ్‌ చేసినట్లు ఈవో రమాదేవి బుధవారం సాయంత్రం ప్రకటించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీతారామానుజాచార్యులు కోడలు, వెంకట సీతారాం భార్య.. వీరిద్దరిపై వరకట్నం, లైంగిక వేధింపుల అభియోగాలతో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్