కార్గిల్ అమరవీరుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: మాధవి

67చూసినవారు
కార్గిల్ అమరవీరుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: మాధవి
కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని గుంటూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శత్రు దేశం పాకిస్తాన్ చొరబాటును ధైర్యంగా ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దేశ సేవలో యువత భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్