

గుంటూరు: అప్పు చెల్లించలేదని భార్యను అపహరించారు
విజయవాడకు చెందిన వాసవి తన కుటుంబ సభ్యుడు చనిపోగా గుంటూరు బొంగరాల బీడ్ శ్మశాన వాటికకు శుక్రవారం వచ్చింది. ఈ క్రమంలో వాసవి భర్త శేఖర్ ముత్యాల రెడ్డి నగరికి చెందిన నర్సారెడ్డి వద్ద గతంలో అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు ఇవ్వలేదన్న కక్షతో నర్సారెడ్డి తన భార్యను శనివారం ఎత్తుకెళ్లిపోయాడని శేఖర్ వాపోయాడు. బాధితుడు ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేసారు.