మంగళగిరి పరిధి యర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సుమారు 150 కుటుంబాల ప్రజలు వైసీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో వారికి ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పార్టీలో చేరినవారు గతంలో టీడీపీ, జనసేనలో కొనసాగుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరారని అన్నారు.