చేనేత వస్త్రాలపై కేంద్ర జీఎస్టీ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ

75చూసినవారు
చేనేత వస్త్రాలపై కేంద్ర జీఎస్టీ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ
మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్యాలయంలో శుక్రవారం చేనేత పితామహులు ప్రగడ కోటయ్య 109వ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై కోటయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ చేనేత కార్మికులు కష్టపడి తయారుచేసే వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయడం దారుణమని దానిని రద్దు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్