ప్రజలను అప్రమత్తంచేస్తూ పోలీసులు మైక్ ప్రచారం

66చూసినవారు
చెడు అలవాట్లకు ఎవరూ బానిసలు కాకూడదని మంగళగిరి రూరల్ పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం మైక్ ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో బహిరంగ మద్యపానం, చెడు వ్యసనాలు, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటిని ఉపేక్షించేది లేదని ప్రచారం చేశారు. ఏదైనా సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ భార్గవి, ఎస్ఐ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్