Apr 30, 2024, 17:04 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
Apr 30, 2024, 17:04 IST
ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి కొప్పులను గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు రాజ కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కనుకయ్య పాల్గొన్నారు.