కలెక్టర్ గ్రీవెన్స్ డేకి వెల్లువెత్తిన ఫిర్యాదులు

68చూసినవారు
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, రైతాంగ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్