రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి

75చూసినవారు
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోరుతూ గురువారం 1k వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హెల్మెట్ లేని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. హెల్మెట్ తో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్