పంట రుసుము రద్దుకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం

78చూసినవారు
పంట రుసుము రద్దుకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం
మిగ్ జాం తుపానుతో పంట కోల్పోయిన బాధిత రైతులను ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. గురువారం గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల అదనపు పంట రుసుము రద్దుకు కేంద్రం గెజిట్ విడుదల చేసిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 34 వేల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఈ సమావేశంలో ఈడీ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్