రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
కొల్లూరు మండలంలో రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని కొల్లూరు మండల విద్యాధికారి వి. జ్యోతి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ కొల్లూరు మండలంలో 3 కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా పరిషత్ బాలురొన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల, అనంతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ కేంద్రాల్లో సుమారు 550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.