టీడీపీలోకి 150 కుటుంబాలు చేరిక
నూజెండ్ల మండలంలోని ముప్పరాజువారిపాలెం గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో శనివారం చేరాయి. వారికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీ కండువా కప్పి సాధారణ ఆహ్వానం పలికారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక టీడీపీలో చేరుతున్నట్లు చేరినవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.