కేరళలోని కన్నూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనంద (18) అనే యువతి స్లిమ్గా మారడానికి ఆన్లైన్ డైటింగ్ మొదలుపెట్టింది. బరువు పెరుగుతామనే భయంతో భోజనం మానేసి, కేవలం ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరగా.. మృతి చెందింది. డాక్టర్ల వివరాల ప్రకారం.. ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల అనోరెక్సియా నెర్వోసా అనే వ్యాధి బారీన పడినట్లు వెల్లడించారు.