పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

50చూసినవారు
పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం పర్చూరు నియోజకవర్గ పరిధిలో 45, 533 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన అధికారులతో కలిసి పండుగలా నిర్వహించాలంటూ ఆయన పార్టీ శ్రేణులను టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు. చంద్రబాబు చేసిన మొదటి ఎన్నికల వాగ్దానాన్ని తాను అధికారంలోకి రాగానే నెరవేర్చారని ఎమ్మెల్యే ఏలూరి చెప్పారు.

సంబంధిత పోస్ట్