
రేపల్లెలో కులాంతర వివాహం
రేపల్లె పట్టణంలోని ది ఆది ఆంధ్ర నవ బుద్ధిష్టు సొసైటీ కార్యాలయంలో శనివారం కులాంతర వివాహం జరిగింది. కొల్లూరు గ్రామానికి చెందిన బవిరెడ్డి ప్రశాంత్, క్రీస్తుల్లంక గ్రామానికి చెందిన విప్పర్ల ప్రత్యూషకు వివాహకర్త దోవా రమేష్ రాంజీ చేత కులాంతర వివాహం(ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్) జరిపించారు. వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించారు.