జగన్ పాలనలో ఇంటి ఇంటికి ఆర్థిక చేయూత
ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లు పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ఇంటి ఇంటికి ఆర్థిక చేయూత అందించారు అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు.సోమవారం చెరుకుపల్లి మండలం రాజోలు,ఆళ్ళవారిపాలెం గ్రామాలలో వైస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలి అంటే డాక్టర్ గణేష్ ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.