యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం

55చూసినవారు
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి స్థానిక సుగాలీకాలనీ జడ్పీ హైస్కూల్లో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద చైతన్య భారతి సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన అద్భుతమైన కానుక యోగా అని, యోగా ద్వారా మన జీవనశైలిని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్