
సత్తెనపల్లి: మోడీ పర్యటన విజయవంతం చేయాలి: కన్నా
మే 2న అమరావతిలో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం కూటమినేతలతో ఆయన విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అమరావతి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా చేయాలని ఆయన అన్నారు.