రాజుపాలెం: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

66చూసినవారు
రాజుపాలెం మండలంలోని గణపవరంలో శ్రీదేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా గ్రామంలో పార్వతయ్య శర్మ ఆధ్వర్యంలో 8వ రోజు గురువారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అనంతరం సుహాసినిలచే కుంకుమ పూజలు, అష్టోత్తర శతనామావళి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్