సత్తెనపల్లి లో అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం

70చూసినవారు
సత్తెనపల్లి లో అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం
సత్తెనపల్లిలోని 12వ వార్డు రాజు కాలనీలో సైడ్ కాలవల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని బుధవారం స్థానికులు వాపోతున్నారు. కాలవల్లో మురుగునీరు ప్రవాహం ఆగిపోవడం వల్ల దోమలు, దుర్వాసన వస్తున్నాయని, జ్వరాలు బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్