సీఎం జగన్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగంవంతం చేశారు. సతీష్ అనే యువకుడు జగన్పై రాయి విసిరినట్లు పోలీసులు గుర్తించారు. సతీష్.. అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు. సతీష్తో పాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైల్ ముక్కను జగన్పై సతీష్ విసిరినట్లు సమాచారం. దాడి వెనుకు ఉన్న కారణాలపై పోలీసులు యువకుల్ని ప్రశ్నిస్తున్నారు.