రత్నం విద్యాసంస్థల అధినేత కన్నుమూత

85చూసినవారు
రత్నం విద్యాసంస్థల అధినేత కన్నుమూత
రత్నం విద్యాసంస్థల అధినేత కేవీ రత్నం (80) బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరు హరనాథపురంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన 1943 మే 23న నెల్లూరు జిల్లా చలపనాయుడపల్లిలో జన్మించారు. 1983లో రత్నం కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్సలు చేయించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్