రీ-పోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

66చూసినవారు
రీ-పోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
సత్తెనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్‌లు, చంద్రగిరిలోని 4 కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈవోతో పాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.

సంబంధిత పోస్ట్