దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని ఒక ఫొటో ఆధారంగా నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి వేడుకలో పాల్గొన్న దంపతులు ఫొటో దిగినంత మాత్రాన వారి మధ్య బంధం బాగానే ఉందని అర్ధం కాదని ధర్మాసనం పేర్కొంది. విడాకుల పిటిషన్పై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. వాదనలు విన్న ధర్మాసనం దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.