భారీ వర్షాలు.. విజయవాడలో 9 మంది మృతి

50చూసినవారు
భారీ వర్షాలు.. విజయవాడలో 9 మంది మృతి
ప్రకాశం బ్యారేజీ, బుడమేరు వరద విజయవాడను అల్లకల్లోలం చేసింది. ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి ఆరుగురు, వరదలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సింగ్‌నగర్, అంబాపురం, జక్కంపూడి, వైఎస్సార్ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ-కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తి మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్