ముచ్చుమర్రిలో హైటెన్షన్ (వీడియో)

68చూసినవారు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన బాలిక (8)పై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. బాలికను కాలువలో తోసేశామని బాలురు చెప్పడంతో గత కొద్ది రోజులుగా మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు సమీపంలో కొత్తపల్లి శివారులో బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. దాంతో ముచ్చుమర్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్