ఏపీలో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను: చంద్రబాబు

82చూసినవారు
ఏపీలో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను: చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించిందని ఆయన తెలిపారు. నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే ముస్లిం కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే... నా గొంతులో ప్రాణముండగా ఏపీలోని ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను అని ఆయన తెలిపారు. తమ పార్టీ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసింది, మతపరమైన సంప్రదాయాలను గౌరవించిందన్నారు.

ట్యాగ్స్ :