వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటించిన నారా భువనేశ్వరి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఏపీ సీఈవో ముకేశ్ మీనాకు వైసీపీ నేత అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో రూ.3 లక్షల చెక్కును ఆమె పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీఈవో స్పందిస్తూ.. విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చారు.