ఏపీలో మే 1 నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారులు ఎవరూ పెన్షన్ కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తారని, మిగిలిన వారికి ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని వెల్లడించారు.